గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మహాశివరాత్రికి త్రికోటేశ్వరునికి సుమారు రూ.3లక్షలు పైచిలుకు ఆదాయం తగ్గింది. గత ఏడాది కోటి 9 లక్షల పైచిలుకు ఆదాయం లభించింది.
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,05,85,830 ఆదాయంగా లభించింది. శనివారం దేవస్థాన అధికారులు హుండీ ఆదాయం లెక్కించారు.
- పూజల టిక్కెట్ల ద్వారా రూ.33,42,565
- హుండీల ద్వారా రూ.45,06,451
- ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,31,620
- విరాళాలు ఇతరత్రా రూ.64,374
- రద్దయిన పెద్ద నోట్లు రూ.40,000
- విదేశీ కరెన్సీ రూ.820 చొప్పున లభించాయి.
- బంగారం 14 గ్రాములు,
- వెండి 703 గ్రాములు లభించింది.