త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 5లక్షలు

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మహాశివరాత్రికి త్రికోటేశ్వరునికి సుమారు రూ.3లక్షలు పైచిలుకు ఆదాయం తగ్గింది. గత ఏడాది కోటి 9 లక్షల పైచిలుకు ఆదాయం లభించింది.

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,05,85,830 ఆదాయంగా లభించింది. శనివారం దేవస్థాన అధికారులు హుండీ ఆదాయం లెక్కించారు.

  1. పూజల టిక్కెట్ల ద్వారా రూ.33,42,565
  2. హుండీల ద్వారా రూ.45,06,451
  3. ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,31,620
  4. విరాళాలు ఇతరత్రా రూ.64,374
  5. రద్దయిన పెద్ద నోట్లు రూ.40,000
  6. విదేశీ కరెన్సీ రూ.820 చొప్పున లభించాయి.
  7. బంగారం 14 గ్రాములు,
  8. వెండి 703 గ్రాములు లభించింది.

Leave a comment