- వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలోని త్రికోటేశ్వరునికి బుధవారం రాత్రి లక్ష మల్లెపూల అర్చన నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్ రామకృష్ణ తదితరులు అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- భక్తులతో గర్భగుడి మొత్తం నిండిపోయింది. రాత్రి 8.30 గంటలకు అర్చన పూర్తయింది. అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించారు.
- స్వామివారికి మల్లెపూలను వెంకయ్యచౌదరి సమర్పించారు. మామిడికాయలు, విసనకర్రలను ధర్మకర్త రామకృష్ణ, పిచ్చయ్య కోడూరి గోపాలకృష్ణ తదితరులు సమర్పించారు.