కోటప్పకొండ త్రికోటేశ్వరుని దేవస్థాన భూముల కౌలు వేలం పాటలు కారణంగా రూ.35 వేలు ఆదాయం అధికంగా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు తెలిపారు. సాతులూరు గ్రామంలో 11.4 ఎకరాల భూములను కౌలుకు వేలం నిర్వహించగా రూ.1,24,400 లభించిందన్నారు.
గత ఏడాది రూ.92,350 మాత్రమే వచ్చిందన్నారు. ఈ ఏడాది రైతులు అక్కడికక్కడే కౌలు డబ్బులు చెల్లించారని వివరించారు.