- త్రికోటేశ్వరస్వామికి శుక్రవారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా లింగోద్భవ అభిషేకాలు నిర్వహించారు.
- పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శుష్కఫలాలు, పండ్ల రసాలు, విభూది, గంధం ఇలా అనేక రకాల ద్రవ్యాలతో తెల్లవార్లు వేద మంత్రోచ్ఛరణ మధ్య అభిషేకాలు సాగాయి.
- చివరిలో పన్నీరు, గంగాజలంతో స్వామివారి అభిషేకం పూర్తయింది.
- దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్ రామకృష్ణ దంపతులు, దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- విఘ్నేశ్వర పూజతో అభిషేకాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాముకు అభిషేకాలు పూర్తయ్యాయి.