- మధ్యాహ్నం నుంచి భక్తులు పెరగడంతో కోటప్పకొండలో నాలుగు రహదారుల కూడలి కిటకిటలాడింది.
- సాయంత్రం 5గంటల సమయంలో మెట్ల దారి రద్దీగా మారింది.
- ప్రసాదాల కౌంటర్లు ఉదయం నుంచి రద్దీగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటలకు లక్షా 30 వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు. అదేవిధంగా 40 వేల అరిసెలు కొనుగోలు చేశారు.
- రాత్రి వేళ ఆలయం, ప్రభలు దేదేప్యమానంగా వెలుగొందాయి.
- పురుషోత్తమపట్నం గ్రామం నుంచి వచ్చిన ఆరు విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలందించేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి.
- జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు 50 మంది ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులకు మంచినీరు అందజేశారు.
- అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ 125 మంది కొండ వద్ద సేవలందించారు.
- ఫ్రెండ్లీ పోలీసు పేరుతో పోలీసు సేవాదళ్ సభ్యులు వికలాంగులకు, అంధులకు, వృద్ధులకు సేవలందించారు.
45 ఏళ్లుగా హాజరవుతున్నా: సభాపతి కోడెల
మేథా దక్షిణామూర్తి త్రికోటేశ్వరుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తజనాన్ని ఆశీర్వదిస్తున్నారు. చేదుకో కోటయ్య.. ఆదుకో కోటయ్య అంటూ భక్తజనులు పిలిస్తే పలికే దైవం ఆయన. 45 ఏళ్లుగా కోటప్పకొండకు హాజరవుతున్నా. మెట్ల మార్గంలో వచ్చి దర్శించుకున్నా. ఘాట్రోడ్డులో వచ్చి దర్శించుకుంటున్నా. స్వామివారికి సేవ చేసే అదృష్టం దక్కింది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయగలిగాం. పర్యావరణ పర్యాటక క్షేత్రం కూడా ఏర్పాటు చేశాం. అతి పెద్ద పుణ్యక్షేత్రంగా భవిష్యత్తులో మారుతుంది.