కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి, సోమవారం ఒకేరోజు రావటంతో గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. స్వామి సన్నిధిలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం వెనుక మర్రిచెట్టు కింద లింగాకారానికి, విఘ్నేశ్వరునికి, నాగేంద్రస్వామికి భక్తులు పూజలు నిర్వహించారు. కొండ దిగువున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వనభోజనాలు చేశారు.