రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదివారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆయన స్వామి దర్శనానికి విచ్చేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు దేవస్థాన ఉద్యోగులు ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రాఘవరావు స్వామి వారికి అభిషేకం చేయించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అనుమోలు వెంకయ్య, బెల్లంకొండ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.